
వాజ్పేయికి ‘భారత రత్న’?
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’కు మాజీ ప్రధాని వాజ్పేయిని ఎంపికచేయవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’కు మాజీ ప్రధాని వాజ్పేయిని ఎంపికచేయవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల 25న తేదీన వాజ్పేయి 90వ జన్మదినం రోజున ఆయన పేరును ఎంపికచేయవచ్చని భావిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ ఆ రోజే ప్రకటన చేయవచ్చని సమాచారం.