భారీ ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోల మృతి | 7 Naxals killed in police encounter in Maharashtra  | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్

Dec 6 2017 11:20 AM | Updated on Oct 9 2018 2:53 PM

 7 Naxals killed in police encounter in Maharashtra  - Sakshi

మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.

సాక్షి, గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా పల్లేడ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. జంగనూరు పీఎస్‌ పరిధిలో ఈరోజు ఉదయం 7 ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

సంఘనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలను, మావోయిస్టుల కిట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో  కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్టు సమాచారం. వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాల్పుల నేపథ్యంలో పోలీసులు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement