ఉత్తర జమ్ము కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది.
శ్రీనగర్: ఉత్తర జమ్ము కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. ఆర్మీ అధికారుల కథనం ప్రకారం.. కుర్ హంబాలోని దబ్ వన్ ఫారెస్టు ఏరియా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం అక్కడికి చేరుకుంది. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పులు జరిపిన సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. వారి నుంచి ఏకే-47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గత వారంలో జరిగిన వివిధ ఎన్ కౌంటర్ లలో ఇద్దరు సైనికులు, పదకొండు మంది ఉగ్రవాదులు మరణించారు.