'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా | vangaveeti radha krishna meets dgp samba shivarao over vangaveeti movie | Sakshi
Sakshi News home page

'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా

Dec 23 2016 10:39 PM | Updated on Sep 4 2017 11:26 PM

'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా

'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా

'వంగవీటి' సినిమాపై అభ్యంతరాలు తెలియజేస్తూ వంగవీటి రాధా కృష్ణ ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు.

విజయవాడ: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ డీజీపీ సాంబశివరావుని శుక్రవారం కలిశారు.

తాము చెప్పిన అభ్యంతరాలను రామ్‌గోపాల్‌వర్మ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement