సమ్మర్‌లోనే రెండో సామి?

సమ్మర్‌లోనే రెండో సామి?


విక్రమ్, త్రిష జంటగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం విడుదలైన ‘సామి’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ పరంగా కేక పుట్టించింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. హిట్‌ ఫార్ములాతో తీసిన ‘సామి’కి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. ఈ సినిమాకి సీక్వెల్‌ చేయడానికి హరి–విక్రమ్‌ రెడీ అయ్యారట.



మొదటి భాగంలో లీడ్‌ రోల్‌ చేసిన త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుండగా, కీర్తీ సురేశ్‌ను మెయిన్‌ హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 15న స్టార్ట్‌ కానుందని∙టాక్‌. ‘సామి’ని సమ్మర్‌లో విడుదల చేశారు. సీక్వెల్‌ని కూడా వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌కి టార్గెట్‌ చేశారట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top