'వరుసగా బెదిరింపులు వస్తున్నాయి' | Pakistan Censor Board Chief Gets Death Threats for Permitting Screening of Salman Khan's 'Bajrangi Bhaijaan' | Sakshi
Sakshi News home page

'వరుసగా బెదిరింపులు వస్తున్నాయి'

Jul 23 2015 4:32 PM | Updated on Jul 11 2019 8:55 PM

'వరుసగా బెదిరింపులు వస్తున్నాయి' - Sakshi

'వరుసగా బెదిరింపులు వస్తున్నాయి'

‘బజ్‌రంగీ భాయిజాన్’ చిత్రంపై పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చైర్మన్ ఫకర్ ఏ ఆలమ్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి.

కాబూల్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్‌రంగీ భాయిజాన్’ చిత్రంపై పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చైర్మన్ ఫకర్ ఏ ఆలమ్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజలను కించపరిచేలా చిత్రంలో వ్యంగ్యమైన యాసను ఉపయోగించారని, కొన్ని సెన్సార్ చేయాల్సిన దృశ్యాలను కూడా ఉన్నాయని విమర్శిస్తూ ఆలమ్‌కు పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు వస్తున్నాయి.

అసలు ఎందుకు ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించందంటూ కూడా విమర్శలు వస్తున్నాయని, కొంతమంది తనను దేశద్రోహిగా ముద్రవేస్తూ బెదిరిస్తున్నారని కూడా ఆలం వెల్లడించారు. ఒకవేళ తాను ద్రోహినైతే ఈ సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా తన దృష్టిలో ద్రోహియేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విమర్శలతో సంబంధం లేకుండా పాక్ థియేటర్లలో బజ్‌రంగీ భాయిజాన్ చిత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇప్పటికే వీకెండ్ వసూళ్లు వంద కోట్ల రూపాయలను దాటాయని చిత్రం పంపిణీదారులు తెలియజేస్తున్నారు. ఆలమ్‌కు ప్రేక్షకుల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తున్న అన్ని థియేటర్ల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.

సెన్సార్ బోర్డు సభ్యులు, పాక్ చిత్ర పరిశ్రమ ఆలమ్‌కు అండగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాగా నడుస్తున్నప్పుడు మన దేశంలో మాత్రం దాన్ని ఎందుకు అడ్డుకోవాలని సెన్సార్ బోర్డు సభ్యులు వాదిస్తున్నారు. పైగా బోర్డులో సభ్యులుగా ఉన్న సైనిక ప్రతినిధులు కూడా సెన్సార్ బోర్డు నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని వారు గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement