అతీంద్రియ శక్తులతో...

అతీంద్రియ శక్తులతో...


 మనుషుల్లో ఉండే అతీంద్రియ శక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకుడు. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధురా శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నీలకంఠ మాట్లాడుతూ- ‘‘ఇది నా కలల చిత్రం. వైవిధ్యమైన కథనంతో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. కథ, కథనాలు కొత్త అనుభూతికి లోను చేస్తాయి. కొత్త దనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘నీలకంఠ సినీ వ్యవసాయదారుడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు సినీచరిత్రలోనే ‘యామ’ బెస్ట్ థ్రిల్లర్. సాంకేతికంగా అద్భుతం ఈ సినిమా. మేలో పాటలను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మధుర శ్రీధర్ తెలిపారు. ఇంకా చిత్ర తారాగణంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదరప్రసాద్ కూడా మాట్లాడారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top