ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో వ్యక్తిగా ఉండే నయనతార... ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. స్వయానా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు, తమిళ యువహీరో ఉదయనిధి స్టాలెన్ని గోళ్లతో రక్కేయడమే కాక, అతణ్ణి ఆసుపత్రి పాలు చేసి సంచలనమే సృష్టించారు. వివరాల్లోకెళ్తే... నయన, ఉదయనిధి స్టాలిన్ కలిసి ‘నన్బేన్డా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో నయనతారకు ఉదయనిధి స్టాలిన్ ప్రేమ ప్రతిపాదన చేశాడనీ, నయనతార కాదనడంతో తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ కొన్ని కథనాలు మీడియాలో వెలువడ్డాయి. దీంతో ఖంగు తిన్న స్టాలిన్ అసలు విషయం మీడియాకు చెప్పేశారు.
తాను ఆసుపత్రి పాలవ్వడానికి కారణం నయనతార అన్నమాట నిజమే కానీ... అది అందరూ అనుకుంటున్న కారణం కాదనీ, షూటింగ్లో జరిగిన చిన్న ప్రమాదం వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిందనీ ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. ‘‘నయనతార నాకు మంచి స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య ‘ప్రేమ’ అనే వ్యవహారమే లేదు. కానీ... లేనిపోనివి సృష్టించేసి అవాకులు చవాకులు రాసే శారు. నిజానికి అక్కడ జరిగింది వేరే.
షూటింగ్లో భాగంగా ఓ షాట్లో నయన, నేనూ దొర్లుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత నయన లేచి అక్కడే ఉన్న ప్రతినాయకుడి చెంప ఛెళ్లుమనిపించాలి. అయితే... కంగారులో విలన్ను కొట్టబోయి పొరపాటున నా చెంప ఛెళ్లుమనిపించింది. ఆ దెబ్బ నా కంటికి బలంగా తగిలింది. కనురెప్పపై గోళ్లతో రక్కినట్లు గాయం అయ్యింది. దాంతో హడావిడిగా హాస్పటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఇది కూడా తాను పొరపాటున చేసిందే’’ అని చెప్పారు ఉదయనిధి స్టాలిన్. ఏది ఏమైనా నయనతార ఏం చేసినా సంచనలమే.
హీరోను ఆసుపత్రి పాలు చేసిన నయనతార
Published Sat, Sep 6 2014 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement