'న‌య‌నం' లోగో లాంచ్‌ | Horror Movie Nayanam logo Launch | Sakshi
Sakshi News home page

'న‌య‌నం' లోగో లాంచ్‌

Oct 4 2017 10:13 AM | Updated on Oct 4 2017 10:13 AM

Nayanam Logo Launch

లావోస్ మోషన్ పిక్చర్స్  ప‌తాకంపై  రూపొందుతున్న  మొదటి చిత్రం 'న‌య‌నం'. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో న‌టిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి  వ‌ద్ద  ఈగ, మర్యాద రామన్న , మగధీర  చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ సినిమాతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర  టైటిల్ లోగో లాంచ్ హైద‌రాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో 'పెళ్లి చూపులు' చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...''న‌య‌నం' టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్ట్ కూడా కొంచెం విన్నాను ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శకుడు రాజ‌మౌళి గారి శిష్యుడి డైర‌క్ష‌న లో సినిమా వ‌స్తుందంటే ఎలా ఉండ‌బోతుందో మ‌నం ప్రత్యేకించి చెప్పన‌క్కర్లేదు. నిర్మాత కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంద‌రికీ నా శుభాకాంక్షలు' అన్నారు.

ద‌ర్శకుడు  క్రాంతి కుమార్ వ‌డ్లమూడి మాట్లాడుతూ... '' న‌య‌నం' టైటిల్ లోగో ఆవిష్కర‌ణ‌కు విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధ‌న్యవాదాలు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వ‌స్తోన్న సినిమా కూడా క‌చ్చితంగా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటుందని' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ....'మా తొలి చిత్రం 'న‌య‌నం' లోగో లాంచ్ అభిరుచి గ‌ల నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది.  ఇటీవ‌ల ఎనౌన్స్ చేసిన న‌య‌నం టైటిల్ కు,  థీమ్ ఏంటో గెస్ చేయండంటూ మేము నిర్వహించిన వినూత్నమైన కాంటెస్ట్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దీపావ‌ళి  రోజున మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ పొడ‌క్షన్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. న‌వంబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నాం' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement