మంచిర్యాల ఆస్పత్రిలో 250 పడకలు | 250 beds in good hospitals | Sakshi
Sakshi News home page

మంచిర్యాల ఆస్పత్రిలో 250 పడకలు

Feb 16 2018 2:30 AM | Updated on Oct 9 2018 5:27 PM

250 beds in good hospitals - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి సామర్థ్యాన్ని 100 పడకల నుంచి 250 పడకలకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ను 30 పడకల నుంచి 100 పడకలకు పెంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి రూ.34.15 కోట్లు, లక్సెట్టిపేట సీహెచ్‌సీకి రూ.22.50 కోట్లను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement