పాక్లో ఇద్దరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు | Two death row convicts executed in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో ఇద్దరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు

Jun 2 2015 10:44 AM | Updated on Sep 3 2017 3:07 AM

పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావెన్స్లో ఇద్దరు ఖైదీలకు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారని మీడియా వెళ్లడించింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావెన్స్లో ఇద్దరు ఖైదీలకు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారని మీడియా వెళ్లడించింది.  2002
కరాచీలో ముహ్మమద్ ఖాన్ ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఖాన్ను సర్గోదా జిల్లా జైలులో ఉరి తీసినట్లు తెలిపింది. అలాగే 1998లో వరుస సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన కైజర్ను మెయిన్వాలి సెంట్రల్ జైల్లో ఉరి తీశారని పేర్కొంది.    
 

Advertisement
 
Advertisement
Advertisement