జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ | Taliban attack on the prison | Sakshi
Sakshi News home page

జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ

Sep 15 2015 2:10 AM | Updated on Sep 3 2017 9:24 AM

అఫ్ఘానిస్తాన్‌లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు...

ఘజ్ని: అఫ్ఘానిస్తాన్‌లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి  సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు.  ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. జైలు తమ అధీనంలో ఉందని, అమాయకులకు స్వేచ్ఛను కల్పించామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement