డబ్ల్యూటీవో సమావేశానికి పాక్‌ దూరం | Pakistan pulls out of WTO ministerial meeting in India | Sakshi
Sakshi News home page

డబ్ల్యూటీవో సమావేశానికి పాక్‌ దూరం

Mar 18 2018 3:27 AM | Updated on Jul 25 2018 1:51 PM

Pakistan pulls out of WTO ministerial meeting in India - Sakshi

ఇస్లామాబాద్‌: వచ్చే వారం ఢిల్లీలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమావేశానికి తాము వెళ్లటం లేదని పాకిస్తాన్‌ తెలిపింది. తమ రాయబార కార్యాలయం అధికారులను భారత్‌ వేధిస్తున్నందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈనెల 19, 20వ తేదీల్లో ఢిల్లీలో డబ్ల్యూటీవో మంత్రుల స్థాయి అనధికారిక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అమెరికా, చైనా తదితర 50కి పైగా దేశాల ప్రతినిధులు హాజరై వ్యవసాయం, సేవల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి వాణిజ్య మంత్రి పర్వేజ్‌ మాలిక్‌ను పంపరాదని నిర్ణయించినట్లు పాక్‌ తెలిపింది. దీంతోపాటు ఢిల్లీలోని రాయబారి సొహైల్‌ మహ్మూద్‌ను పాక్‌ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement