ఉగ్రవాదంపై పోరులో భారత్–రష్యాలు సహజ భాగస్వాములని ప్రధాని మోదీ తెలిపారు.
భారత పారిశ్రామికాభివృద్ధిలో అప్పటి సోవియట్ యూనియన్ చేసిన సాయం మరువలేనిదని ప్రధాని ప్రశంసించారు. మిలటరీ సాంకేతికత రంగంలో సహకారం భారత–రష్యా బంధాలకు బలమైన పునాది. రష్యన్ పరికరాలు, సాంకేతికతే మా భద్రతా విభాగంలో కీలకం. ప్రస్తుతం సాఖాలిన్ 1, వాంకోర్, తాస్–యుర్యాఖ్ చమురు క్షేత్రాల్లో భారత పెట్టుబడులు, సాంకేతిత.. కూడంకుళం అణువిద్యుత్ ప్లాంటు, బ్రహ్మోస్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో భాగస్వామ్యం మా దోస్తీకి నిదర్శనం’ అని ప్రధాని పేర్కొన్నారు.