ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్! | Atomic bomb survivors want Obama to meet, apologize in Hiroshima | Sakshi
Sakshi News home page

ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్!

May 19 2016 6:59 PM | Updated on Aug 20 2018 2:50 PM

ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్! - Sakshi

ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్!

అమెరికా అణుబాంబు దాడికి గురై బాధితులుగా మిగిలిన పలువురు జపానీయుల ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవాలనుకుంటున్నారు.

టోక్యో: అమెరికా అణుబాంబు దాడికి గురై బాధితులుగా మిగిలిన పలువురు జపానీయుల ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవాలనుకుంటున్నారు. ఆయనను కలిసే సందర్భంగా వారి దీనగాధను చెప్పడమే కాకుండా తమ ప్రజలకు క్షమాపణలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. టోక్యోలోని ఓ జాతీయ సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు ప్రధానంగా ఈ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగాసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన విషయం తెలిసిందే.

దీంతో వేలమంది ప్రాణాలుకోల్పోవడమే కాకుండా ఎంతోమంది వికలాంగులుగా మారారు. ఇప్పటికీ ఆ బాంబు ప్రభావం అక్కడ ఉంది. తన పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఒబామా సెంట్రల్ జపాన్ లో జరగనున్న జీ-7 సమావేశానికి ఈ నెల 27న హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే హిరోషిమా పట్టణంలో పర్యటించనున్నారు. తద్వారా హిరోషిమాను సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలవబోతున్నారు. కాగా, ఒక వేళ హిరోషిమా బాధితుల తరుపున వచ్చేవారితో ఒబామా సమావేశం అయినా క్షమాపణలు మాత్రం చెప్పబోరని వాషింగ్టన్ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement