డ్రైవర్ నిర్లక్ష్యానికి 50 మంది బలి! | 29 killed in Pakistan accident | Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష్యానికి 50 మంది బలి!

Nov 11 2014 9:58 AM | Updated on Mar 23 2019 8:04 PM

డ్రైవర్ నిర్లక్ష్యానికి 50 మంది బలి! - Sakshi

డ్రైవర్ నిర్లక్ష్యానికి 50 మంది బలి!

డ్రైవర్ అధిక వేగంతో బస్సును నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్పైకి దూసుకుపోయింది.

ఇస్లామాబాద్: డ్రైవర్ అధిక వేగంతో బస్సును నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్పైకి దూసుకుపోయింది. దాంతో బస్సులోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి బస్సులోని 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్లోని దక్షిణ సూక్కుర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement