'ఒంటరిగానే పోటీకి దిగుతాం' | YSRCongress Party to go it alone in GHMC elections, says ponguleti srinivasa reddy | Sakshi
Sakshi News home page

'ఒంటరిగానే పోటీకి దిగుతాం'

Jan 8 2016 7:06 PM | Updated on Aug 11 2018 8:00 PM

'ఒంటరిగానే పోటీకి దిగుతాం' - Sakshi

'ఒంటరిగానే పోటీకి దిగుతాం'

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్గా మర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒకటి, రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. ఒంటరిగానే పోటీలోకి దిగుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement