ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి | YS Jagan Mohan Reddy ugadi festival wishes to All Telugu Peoples | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి

Apr 8 2016 4:36 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి - Sakshi

ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సరం తొలి పండుగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. సకాలంలో వానలు పడి.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాడిపంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement