తల్లి అదృశ్యం: కుమారుడి పరిస్థితి విషమం | Woman missing | Sakshi
Sakshi News home page

తల్లి అదృశ్యం: కుమారుడి పరిస్థితి విషమం

Feb 18 2016 7:02 PM | Updated on Jul 12 2019 3:02 PM

బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన తల్లి ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఆమె కుమారుడి పరిస్థితి క్షీణిస్తోంది.

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన తల్లి ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఆమె కుమారుడి పరిస్థితి క్షీణిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతి(26)  ఈ నెల 15వ తేదీన భర్త వెంకన్నబాబుతో కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న తమ ఏడాదిన్నర కొడుకుని తీసుకుని రెయిన్‌బో ఆస్పత్రికి వచ్చింది. సమీపంలోని ఆస్పత్రిలో కుమారుడికి స్కానింగ్ జరుగుతుండగానే బయట తన పరిచయస్తుడితో భర్తకు తెలియకుండా వెళ్లిపోయింది.

చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె కోసం వెదికిన భర్త చివరికి పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆమె కోసం రెండు ప్రత్యేక బృందాలను కృష్ణా, నెల్లూరు జిల్లాలకు పంపించారు. కాగా తల్లి కనిపించక చిన్నారి అల్లాడిపోతున్నాడు. చిన్నారి పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement