డంపింగ్ యార్డుపై గ్రామస్థుల నిరసన | Villagers protested against the dumping yard | Sakshi
Sakshi News home page

డంపింగ్ యార్డుపై గ్రామస్థుల నిరసన

Oct 5 2016 10:38 AM | Updated on Mar 28 2018 11:26 AM

డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్‌ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement