ఉస్మానియా యూనివర్సిటీలో అర్థరాత్రి కలకలం రేగింది. సమస్యలు వేధిస్తున్నాయంటూ విద్యార్థినులు ఆందోళనకు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం అర్థరాత్రి కలకలం రేగింది. సమస్యలు వేధిస్తున్నాయంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో వసతులు సరిగ్గా లేవంటూ విద్యార్థినులు ధర్నా చేశారు. నీటి సమస్య, సెక్యూరిటీ సమస్య వేధిస్తోందని, వీటిపై పలు మార్లు ఉన్నతాధికారులకు వివరించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.