ఊరూరుకు బారు, బీరు ఇస్తామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు.
దళితులపై దాడులు, అవినీతి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్రావు, బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
