ప్రాణత్యాగాలు చేస్తున్నా బాబు వైఖరిలో మార్పులేదు | jyothula nehru takes on arun jaitley and chandrababu | Sakshi
Sakshi News home page

ప్రాణత్యాగాలు చేస్తున్నా బాబు వైఖరిలో మార్పులేదు

Oct 30 2015 1:57 PM | Updated on Jul 28 2018 3:30 PM

ప్రాణత్యాగాలు చేస్తున్నా బాబు వైఖరిలో మార్పులేదు - Sakshi

ప్రాణత్యాగాలు చేస్తున్నా బాబు వైఖరిలో మార్పులేదు

ప్రత్యేక హోదాల శకం ముగిసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనడం పచ్చి మోసమని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు.

హైదరాబాద్ : ప్రత్యేక హోదాల శకం ముగిసిందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అనడం పచ్చి మోసమని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... జైట్లీ వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమన్నట్లు ఉన్నాయన్నారు.

ప్రత్యేక హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయడ్డారు. ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నా.. చంద్రబాబు వైఖరిలో మాత్రం మార్పు లేదని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement