'ఎన్నికల ప్రక్రియను ఎందుకు కుదించారు' | high court questions the government on ghmc elections | Sakshi
Sakshi News home page

'ఎన్నికల ప్రక్రియను ఎందుకు కుదించారు'

Jan 7 2016 11:49 AM | Updated on Aug 31 2018 8:24 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు సరికాదంటూ దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు సరికాదంటూ దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను ఎందుకు కుదించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ను ఎందుకు తసుకురాలేదని కోర్టు అడిగింది.

జనవరి 31 లోగా ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనతో ఎన్నికల ప్రక్రియను కుదించామని ఏజీ సమాధానమిచ్చారు. అయితే ఎన్నికలు ఎన్నిరోజుల్లోగా నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, అవసరమైతే రెండు, మూడు వారాలు గడువు పొడగిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల పూర్తి షెడ్యూల్ ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తీర్పును మధ్యాహ్నాం 2:30 గంటలకు వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement