* ఆడిట్ విభాగంలో మంటలు
* కాలిపోయిన లాకర్లు, బీరువాలు, పత్రాలు
ఖైరతాబాద్: సైఫాబాద్లోని ఏజీ ఆఫీసులో సోమవారం అర్దరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో డి బాక్ల్ 3వ అంతస్తులోని ప్రిన్సిపల్ డెరైక్టర్ సెంట్రల్ (ఆడిట్) కార్యాలయ విభాగం కాలిపోయింది. అక్కడున్న హై సెక్యూర్డ్ లాకర్లు, బీరువాలు, కంప్యూటర్లు, టేబుళ్లపై ఉన్న డాక్యుమెంట్లు పూర్తిగా తగలబడిపోయాయి. వివరాలు... సోమవారం అర్దరాత్రి తర్వాత ఏజీ ఆఫీసు ప్రధాన గేటు ముందు ఉన్న డి బ్లాక్ 3వ అంతస్తు నుంచి మంటలు, పొగలు వచ్చాయి.
గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఏజీ ఆఫీసు ఉన్నతాధికారులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 1.30కి అసెంబ్లీ నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి ల్యాడర్ సాయంతో 3వ అంతస్తు పైకి ఎక్కి మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితంలేకపోయింది. దీంతో గౌలిగూడ, సికింద్రాబాద్ల నుంచి ఫైరింజిన్లుతో పాటు ప్రత్యేకంగా బ్రౌజర్ ఫైర్ ఇంజిన్ను రప్పించారు. బ్రౌజర్ సాయంతో నేరుగా కిటికీల వద్దకు వెళ్లి అద్దాలు పగులగొట్టి మంటలు ఆర్పేందుకు యత్నించారు. మరోవైపు కార్యాలయ గదుల్లోకి వెళ్లి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా పొగ కమ్ముకోవడం, మరో వైపు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకట్లోనే సహాయక చర్యలు చేపట్టారు. అయినా ఒకపట్టాన మంటలు అదుపులోకి రాలేదు.
అతికష్టం మీద అదుపులోకి...
మొత్తం 8 ఫైరింజిన్లలో నీరు చల్లి అతికష్టం మీద ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12.30కి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆఫీసులోని లాకర్లు, బీరువాలు, కంప్యూటర్లు, ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయి. సహాయక చర్యలను సిటీ డీఎఫ్ఓ శ్రీనివాస్రెడ్డి, ఏడీఎఫ్ఓ ప్రభాకర్రెడ్డి, ఎస్ఎఫ్ఓ తుకారం, ముస్తఫాలు పర్యవేక్షించారు. కాగా, అగ్నిప్రమాదంపై మంగళవారం సాయంత్రం ఏజీ ఆఫీసు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎల్.కృష్ణన్ సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఫైర్సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా...
ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదం ఎలా జరిగిందో అంటుబట్టడంలేదు. అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్లోనే ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు.
ఖైరతాబాద్ ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం
Published Wed, May 4 2016 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement