మంత్రి నారాయణతో ఉద్యోగ సంఘాల భేటీ | Employees committees to meet AP minister narayana | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణతో ఉద్యోగ సంఘాల భేటీ

Mar 21 2016 4:25 PM | Updated on Sep 3 2017 8:16 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో విడతలవారీగా విజయవాడకు వెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.

జూన్‌ 15 కల్లా 4 వేల మందిని, జూలైకి మరో 3 వేల మందిని, ఆగస్టుకు మరో 3వేల మంది ఉద్యోగులను తరలిస్తామని చెప్పారు. వెలగపూడిలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు అంతస్తులతో పాటు కొత్తగా మరో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement