క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Published Sun, May 8 2016 12:56 PM

cricket betting gang arrested in hyderabad

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు ఇంటిపై దాడి చేశారు.  వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.4 లక్షల నగదు, ఐదు సెల్ ఫోన్లతోపాటు రెండు టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
 

Advertisement
Advertisement