జిల్లాల వారీగా సీనియర్ ప్రిన్సిపాళ్లతో కమిటీల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా వారి ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇటీవలే పూర్తి కాగా, కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ముగ్గురు సీనియర్ లెక్చరర్లతో కమిటీలను ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ప్రారంభించింది. అయితే జూన్ 2 నాటికి క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న 13 వేల మంది ఉద్యోగుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు 5 వేల మందికి పైగా ఉన్నారు. వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అనేక సమస్యలు బయట పడుతున్నాయి. కొందరికి అర్హతలు లేకపోగా, కొందరు పని చేస్తున్న కాలేజీల్లో మంజూరైన పోస్టులే లేవు.
అర్హతలు లేనివారే అధికం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన నిబంధనల ఉత్తర్వుల (జీవో 12, జీవీ 302) ప్రకారం 300 మందికి లెక్చరర్ పోస్టుకు ఉండాల్సిన అర్హతలు లేవని ఇదివరకే ఇంటర్మీడియట్ విద్యాశాఖ గుర్తించింది. ఇక 71 కాలేజీల్లో 632 మంది కాంట్రాక్టు లెక్చర ర్లు అసలు మంజూరే కాని పోస్టుల్లో పని చేస్తున్నట్లు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం పోస్టులు మంజూరు కాకుండా వారిని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు.
మరోవైపు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులను నిర్వహించే కాలేజీల్లోనూ 250 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మంజూరు కాని పోస్టుల్లోనే పని చేస్తున్నారు. దీంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే గతంలో సీఎం కేసీఆర్ను వారు కలసినపుడు పోస్టులు మంజూరు చేసి, క్రమబద్ధీకరించాలని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారికి పోస్టులు మంజూరు చేశాకే క్రమబద్ధీకరణ చేసే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ అంశంపై చర్చించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధ్యం కాకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు మంజూరు కాని పోస్టుల్లో పని చేస్తున్న వారికి పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాలని రాజీవ్శర్మ ఆదేశించినట్లు తెలిసింది. వారితోపాటు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మంజూరు కాని పోస్టులో పని చేస్తున్నట్లు తెలిసింది.
డిగ్రీ కాలేజీల్లోనూ అనేక సమస్యలు: కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల క్రమబద్ధీకరణలోనూ అనేక సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు. 940 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లలో 40 మంది లెక్చరర్లు 2014 జూన్ 2 నాటికి సర్వీసులోనే లేరని తేలింది. మరో 170 మందిలో 50 మందికి ఉద్యోగంలో చేరే నాటికి సరైన అర్హతలు లేవు.
కాంట్రాక్టు అధ్యాపకుల ‘వెరిఫికేషన్’ ప్రక్రియ షురూ
Published Thu, May 19 2016 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement