బెడిసికొట్టిన చింతల విమర్శ | Concerns avert criticism | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన చింతల విమర్శ

Mar 29 2016 1:43 AM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సోమవారం శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేసిన ఓ ప్రయత్నం బెడిసికొట్టింది.

 హర్షంతో బల్లలు చరిచిన అధికారపక్ష సభ్యులు

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సోమవారం శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేసిన ఓ ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించే క్రమంలో చింతల మాట్లాడుతూ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఓ ఎస్సీ బాలిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని తేల్చారన్నారు.

అయితే ఆ బాలికను సీఎం వద్దకు తీసుకెళ్లగా ప్రభుత్వపరంగా ఆ ఖర్చు భరించేలా సాయం చే సేందుకు హామీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. సీఎం ఉదారతను ప్రశంసించేలా పరిస్థితి మారటంతో అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగుంటే పేదలపై ఆర్థిక భారం పడేది కాదని చింతల చెప్పాలనుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement