అమరావతిలో అంబేడ్కర్ స్మృతి చిహ్నం | Ambedkar memorial in Amravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో అంబేడ్కర్ స్మృతి చిహ్నం

Feb 15 2016 2:25 AM | Updated on Aug 29 2018 7:45 PM

అమరావతిలో అంబేడ్కర్ స్మృతి చిహ్నం - Sakshi

అమరావతిలో అంబేడ్కర్ స్మృతి చిహ్నం

రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పదెకరాల్లో అంబేడ్కర్ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు.

10 ఎకరాల్లో ఏర్పాటు: మంత్రి రావెల కిశోర్‌బాబు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పదెకరాల్లో అంబేడ్కర్ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. అంబేడ్కర్ 125వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించేందుకు కేంద్రం తయారు చేసిన ప్రణాళికను రాష్ట్రంలోనూ అమలు చేయడానికి అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకుంటామని రావెల చెప్పారు. వాటిపై కేబినెట్‌లో చర్చించి ఉత్సవాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement