అమ్ముడుపోయారా? : ఆప్ | aap fires on andhra government | Sakshi
Sakshi News home page

అమ్ముడుపోయారా? : ఆప్

Feb 28 2014 1:49 AM | Updated on Apr 4 2018 7:42 PM

కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్: కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను రిలయన్స్ అధినేతలైన అంబానీలు గుప్పిట్లో పెట్టుకొన్నారని ఆ పార్టీ ఆరోపించింది. గురువారమిక్కడ ఆప్ నేతలు కిరణ్‌కుమార్, చక్రిలతో కలిసి రాష్ట్రశాఖ కన్వీనర్ బి. రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు.
 
  రాష్ట్ర ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడే గ్యాస్ ధర పెంపుదలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంబానీకి అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement