కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు | 6 percent Kickbacks of KCR family | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు

Feb 20 2016 3:18 AM | Updated on Aug 16 2018 1:18 PM

కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు - Sakshi

కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు

రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరుగుతోందని..

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరుగుతోందని.. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొన్ని కంపెనీలకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టడానికి ప్రభుత్వం నిబంధనలు, మార్గదర్శకాలను మార్చడం వెనుక భారీగా ముడుపుల వ్యవహారం దాగుందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలున్న కాంట్రాక్టు సంస్థలకు పనులను అప్పగించడం ద్వారా ముడుపులు తీసుకోవడానికి ఇలాంటి చర్యలకు ప్రభుత్వం దిగిందని.. సీఎం కుటుంబ సభ్యులకు ఈ పనుల మొత్తంలో 6 శాతం ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement