సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని విష్ణునగర్లో విషాదం చోటు చేసుకుంది.
కారు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి
Aug 7 2017 12:01 PM | Updated on Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని విష్ణునగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రాజుకు రెండేళ్ల కుమార్తె చైత్ర ఇంటి ముందు ఆడుకుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement