అత్యాచారానికి గురైన ఓ బాలిక మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది.
హెచ్ఆర్సీ ఆశ్రయించిన బాలిక
Mar 19 2016 3:14 PM | Updated on Sep 3 2017 8:08 PM
హైదరాబాద్: అత్యాచారానికి గురైన ఓ బాలిక మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ బాలిక కొన్ని రోజుల క్రితం లైంగిక దాడికి గురైంది.దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు.ఈ విషయంలో జోక్యం చేసుకున్న స్థానిక రాజకీయ నాయకులు బేరసారాలకు రమ్మని బెదిరించటం ప్రారంభించారు.దీంతొ న్యాయం కోసం ఎన్నిసార్లు పోలీస్స్టేషన్ కు వెళ్లినా స్పందన కరువైంది.చివరికి ఆంధ్ర మహిళా కమిషన్కు తన సమస్యను వివరించింది.శనివారం మధ్యాహ్నం వారు మానవ హక్కుల కమిషన్ను కలిసి,తమకు కలిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫిర్యాదు అందజేశారు.
Advertisement
Advertisement