* ‘అంతిమ లబ్ధిదారు’ కావడంతో లోతుగా ఆరా
* డ్రైవర్, పనిమనిషి, సన్నిహితుల విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ‘అంతిమ లబ్ధిదారు’ అయిన టీడీపీ నేత వేం నరేందర్రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.
టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా వేం నరేందర్రెడ్డే ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు కావడంతో ఆయనపై ఏసీబీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆధారాల సేకరణలో భాగంగా ఆయన డ్రైవర్ చిన్ని, ఇంట్లో పనిచేసే అర్జున్తో పాటు కుటుంబ సన్నిహితుడు వీరభద్రంచను కేసులో సాక్షులుగా పరిగణిస్తూ శుక్రవారం విచారించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 దాకా వారిని ప్రశ్నించింది. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో విచారించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ కుట్ర ప్రారంభమైన నాటి నుంచీ వేం కదలికలు, ఆయన్ను కలిసిన వ్యక్తులకు సంబంధించే ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఆ రెండు రోజులు ఏం జరిగింది?
మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పలువురు ‘ముఖ్య’ నేతలతో వేం సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీకి ప్రాథమిక సమాచారం లభించింది. దీనిపై డ్రైవర్ చిన్నికి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ప్రధానంగా మే 30, 31 తేదీల్లోవేం ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరెవరితో భేటీ అయ్యారనే అంశాలను ఏసీబీ ఆరా తీసింది. ఇంట్లో జరిగిన విషయాల గురించి పనిమనిషి అర్జున్ను ప్రశ్నించింది.
మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, కేసులో మరో నిందితుడు ఉదయసింహ ఇద్దరూ వేంతో సంప్రదింపులు జరిపినట్టు ఏసీబీ వద్ద ఆధారాలున్నాయి. వేం ఇంటికి ఎవరెవరు, ఎప్పుడెప్పుడొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారా, దేని గురించి మాట్లాడుకున్నారనే వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. నరేందర్ ఇంటికి రేవంత్ ఎన్నిసార్లు, ఎవరెవరితో కలిసి వచ్చారనే దానిపై కూడా అడిగినట్లు తెలిసింది. వీరభద్రానికి వేం ఆర్థికాంశాలతో సంబంధమున్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది.
ఆ దిశగా ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలపై వీడియో టేపుల వంటి పక్కా ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయి. మిగతా నిందితులకు సంబంధించి ప్రాథమికంగా సాంకేతిక ఆధారాలను సేకరించగలిగారు. మిగతా నిందితులు, అనుమానితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు నేర నిరూపణకు ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వారి పాత్రకు సంబంధించిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సేకరణపై దృష్టి పెట్టింది.
‘ఓటుకు కోట్లు’ కేసులో సర్కమ్స్టాన్షియల్ విట్నెస్లను (నేర సన్నాహాలను గమనించిన, నిందితులు, అనుమానితుల కదలికల్ని చూసిన, వాటి గురించి తెలిసినవారు) ఏసీబీ ముందునుంచీ గుర్తిస్తూ, వారి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు నాటికే ఇలాంటి 9 మంది సాక్షులను గుర్తించింది.
వేం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Published Sat, Jul 18 2015 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement