అక్రమంగా రైలులో తరలిస్తున్న మూడు కిలోల బంగారాన్ని వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా రైలులో తరలిస్తున్న మూడు కిలోల బంగారాన్ని వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. సీతారాములు అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నుంచి వరంగల్కు తీసుకువస్తుండగా సోమవారం ఉదయం రైల్వే పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. సీతారాములును అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుంది. గతంలో కూడా ఇతడు రెండున్నర కిలోల బంగారాన్ని ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకురాగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.