పురాతన శివలింగాన్ని రాయి అనుకుని..


నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఓ ఇంట్లో పురాతన శివలింగం లభ్యమైంది. అయితే, పదిహేనేళ్ల క్రితమే వెలుగు చూసినా అది శివలింగమని వారికి తెలియకపోవడంతో ఇన్నాళ్లూ మరుగునపడి ఉంది. ఎలుగూరి వెంకటేశ్వర్లు పాత ఇంటిని తొలగించే క్రమంలో 15 ఏళ్ల క్రితం ఓ రాయి బయటపడింది. కొబ్బరికాయలు కొట్టేందుకు పనికి వస్తుందని దాన్ని దాచిపెట్టారు. సోమవారం ఇంట్లో పూజల సమయంలో కొబ్బరికాయ కొట్టేందుకు ఆ రాయిని తీసుకురాగా, అది శివలింగమని పురోహితులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అసలు విషయం తెలియడంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ శివలింగాన్ని ఏదో ఒక శివాలయానికి తరలించాలని నిర్ణయించారు.




 




 

Read also in:
Back to Top