పూర్వకాలంలో మానవులమధ్య సత్సంబంధాలు, ఆప్యాయత, ప్రేమానురాగాలు మెండుగా ఉండేవి. ఇప్పుడు లేవనికాదు, గతంతో పోల్చుకుంటే సన్నగిల్లా యి. ఆ రోజుల్లో ఎవరైనా అతిథి వస్తే సంతోషించేవారు. ఆప్యాయంగా స్వాగతం పలికేవారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం వారి కోసం కేటాయించేవారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.
అతిథి మర్యాద ఇస్లామియ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశం. ఒకసారి దైవప్రవక్త ముహ మ్మద్ (స) సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై, ‘అయ్యా! నేను నిరుపేదను. ఆకలి దహించివేస్తోంది’ అని అభ్యర్థిం చాడు. ఆ రోజు ప్రవక్త వారి ఇంట కూడా పచ్చి మంచి నీళ్లు తప్ప మరేమీలేదు. అందుకని, ప్రవక్త మహనీ యులు అక్కడున్న సహచరులతో, ‘ఈ పూట ఇతని కెవరైనా ఆతిథ్యం ఇవ్వగలరా?’ అని అడిగారు. ఓ సహ చరుడు స్పందించి, ‘దైవ ప్రవక్తా! నేనిస్తాను’ అన్నాడు. అతిథిని వెంట బెట్టుకొని ఇంటికి వెళ్లాడు. ‘ఈ రోజు మన ఇంటికి ఓ అతిథి వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా?’ అని శ్రీమతిని సంప్రదించారు. ‘పిల్లల కోసమని ఉంచిన కాస్తంత భోజనమే తప్ప మరేమీ లేదు. అది కూడా వచ్చిన అతిథి ఒక్కరికైతేనే సరిపోతుందేమో!’ అని బదులిచ్చారామె. ‘అతిథిని గౌర వించడం మన విధి. పిల్లలకు ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. పిల్లలు నిద్రపోగానే భోజనం వడ్డించు. మేము భోజనానికి కూర్చున్న తరువాత, వడ్డన సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్టు నటించి, ఆర్పి వెయ్యి. చీకట్లో అతిథితోపాటు మనం కూడా తింటున్నట్లే నటిద్దాం’ అని చెప్పారాయన.
అనుకున్నట్లుగానే ఆ ఇల్లాలు పిల్లలను నిద్ర పుచ్చి, భోజనం వడ్డించింది. అందరూ కూర్చున్నారు గాని, అతిథి మాత్రమే భోజనం చేశాడు. తాము కూడా తింటున్నట్లే నటించిన ఆ దంపతులిద్దరూ, పిల్లలతో సహా పస్తులే ఉన్నారు.
మరునాడుదయం ఆతిథ్యం ఇచ్చిన సహచరుడు ప్రవక్త మహనీయుల వారి సన్నిధిలో హాజరైనప్పుడు, ప్రవక్త వారు ‘అబూతల్హా’ అంటూ ఆయన పేరును, ఆయన సతీమణి పేరునూ ఉచ్ఛరిస్తూ, ‘దైవానికి తన ఫలానా భక్తుడు, భక్తురాలి తీరు నచ్చింది. అతిథి పట్ల వారు చూపిన మర్యాద, త్యాగభావనకు అల్లాహ్ అమి తంగా సంతోషించాడు’ అని శుభవార్త వినిపించారు.
‘వారు స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమ కంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు’ అని పవిత్ర ఖురాన్ ఈ త్యాగగుణాన్ని అభివర్ణించింది. తమ అవస రాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యమివ్వడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నత పుణ్యకార్యాలు. కాని ఈనాడు అతిథి పట్ల మొహమాటపు పలకరింతలే కాని, ఆప్యాయత ఉట్టి పడటంలేదు. ఈ ఉరుకులు, పరుగుల మధ్య ఒకర్ని గురించి ఒకరు పట్టించుకునేంత తీరిక లభించడం లేదు. ఇలాంటి సుగుణాలు లోపించబట్టే శాంతి లేకుండా పోతోంది. అందుకని సాధ్యమైనంత ఎక్కువగా సత్సంబంధాలు నెరపడానికి, స్నేహధర్మా న్ని, అతిథి మర్యాదను గౌరవించడానికి ప్రాధాన్యతని వ్వాలి. అప్పుడే దైవ ప్రసన్నతా భాగ్యం కలుగుతుంది.
- యం.డి.ఉస్మాన్ఖాన్
అతిథి మర్యాద
Published Fri, Dec 5 2014 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement