రాకాసి సరస్సు
ఏదైనా సరస్సు చుట్టూ చెట్లూ పుట్టలూ, గట్టులూ ఉండటం సహజం. సరస్సులోని నీటిని తాగడానికి, అందులో ఉండే చేపలను, ఇతర జలచరాలను తినడానికి వచ్చే పక్షులు కిలకిలారావాలు చేస్తూ, సరస్సు చుట్టూ తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అయితే సరస్సు ఒడ్డున పక్షులు గుట్టలు గుట్టలుగా విగతజీవుల్లా కనిపిస్తే చూసిన వారికెవరికైనా మనసు చలించక మానదు. అదేం సరస్సురా దేవుడా? అసలు అదెక్కడుంది అనుకుంటున్నారా? అది ఉత్తర టాంజానియా దేశంలో ఉంది. ఆ సరస్సు పేరు నాట్రాన్. అది ఉండే ప్రాంతం కెన్యా దేశపు సరిహద్దుల్లో ఉంటుంది. నాట్రాన్ పూర్తిగా ఉప్పు నీటి సరస్సు. ఉప్పు నీరున్నంత మాత్రాన పక్షులు ఎందుకు చనిపోతాయి? అదే కదా ప్రశ్న...
ఆ నీటిలో సోడియం కార్బొనేట్ శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి ఉష్ణోగ్రత కూడా ఎక్కువే. అక్కడి నీటిలోని పీహెచ్ విలువ 10.5-12 వరకు ఉంటుందట. దాంతో ఆ నీటిని తాకిన జంతువులు లేక పక్షుల చర్మం, కళ్లు నిమిషాల్లో కాలిపోతాయట, అలా వాటి ప్రాణాలు తీసే రాక్షసి ఆ నాట్రాన్ సరస్సు. అలా అని ఆ సరస్సులో ఏ ప్రాణులూ ఉండవా అంటే ఉండవని కావు. ఉప్పుతో జీవించగలిగే విభిన్న జాతి పక్షులు, చేపలు అందులో జీవిస్తుంటాయి. ఆ సరస్సు చూడడానికి కూడా వింతగానే ఉంటుందట. ఎలా అంటే అందులోని నీరు ఎర్రగా కనిపిస్తుందట. ఎందుకంటే ఆ నీటిలో జీవించే ప్రాణుల్లో ఎర్రటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటమే కారణం.
ఉప్పే ముప్పు...
Published Tue, Sep 29 2015 11:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement