కాదేదీ విద్యుదుత్పత్తికి అనర్హం..! | Electricity is preferred | Sakshi
Sakshi News home page

కాదేదీ విద్యుదుత్పత్తికి అనర్హం..!

Mar 11 2015 4:02 AM | Updated on Jul 29 2019 6:10 PM

ఈ కాలంలో విద్యుత్ ప్రాధాన్యం తెలియందెవరికి? దురదృష్టమేమిటంటే...

ఈ కాలంలో విద్యుత్ ప్రాధాన్యం తెలియందెవరికి? దురదృష్టమేమిటంటే... ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఈ సౌకర్యానికి దూరంగానే ఉన్నారు. ఇటువంటి వారికి కూడా చౌకగా విద్యుత్తు వెలుగులు పంచేందుకు ఎన్నో ప్రయత్నాలూ జరుగుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ సమస్య పరిష్కారానికి ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. మానవ మూత్రంతోనే చిన్న మోతాదులో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఓ ఫ్యుయెల్ సెల్‌ను అభివృద్ధి చేసింది.

ఫ్యుయెల్ సెల్‌లోని సూక్ష్మజీవులు మూత్రాన్ని విడగొట్టి విద్యుత్తును నేరుగా ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో ఫ్యుయెల్‌సెల్‌ను తయారు చేసేందుకు డాలరు (రూ.63) కంటే ఎక్కువ ఖర్చు కాదని ఈ ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లెరోపౌలస్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, అశాంతి చెలరేగుతున్న ప్రాంతాల్లో ఉన్న శరణార్థి శిబిరాల్లో విద్యుత్తు వెలుగులు పండించే లక్ష్యంతో తాము దీన్ని అభివృద్ధి చేశామని, ఒక్కో ఫ్యుయెల్ సెల్‌తో ఎల్‌ఈడీ బల్బులనూ వెలిగించవచ్చునని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement