ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాం | ysrcp will get more seats than survey, says konatala ramakrishna | Sakshi
Sakshi News home page

ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాం

Mar 31 2014 2:41 AM | Updated on Aug 14 2018 5:54 PM

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నీల్సన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన సీట్లకన్నా తమ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు.

నీల్సన్ సర్వేపై వైఎస్సార్‌సీపీ నేత కొణతాల


 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నీల్సన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన సీట్లకన్నా తమ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీవీ ప్రసారం చేసిన నీల్సన్ సర్వే ప్రకారం సీమాంధ్రలో తమ పార్టీ 129-133 అసెంబ్లీ స్థానాలు, 19-21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైందని, అయితే తమ పార్టీ అంచనా ప్రకారం అంతకన్నా ఎక్కువ సీట్లనే తాము గెలుచుకోనున్నామని ఆయన చెప్పారు. 25 లోక్‌సభ స్థానాల్లో, అలాగే 140-150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని కొణతాల చెప్పారు. 2012లో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలోని 17 స్థానాల్లో తమ పార్టీ 15 స్థానాలు గెలుచుకుందని గుర్తుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement