రూ. లక్ష నగదు, 30 తులాల బంగారం అపహరణ... ఓటేసేందుకు వెళ్తే ఇల్లు దోచేశారు
తల్లిదండ్రులు ఓటు వేసేందుకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న పిల్లలను బెదిరించి రూ. లక్ష నగదుతోపాటు, 30 తులాల బంగారాన్ని దోచేశారు. స్థానిక శాంతినగర్ గౌరవ్ గార్డెన్స్ సమీపంలోని ఓ ఇంట్లో కాంట్రాక్టర్ రఘునాథరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తమ పిల్లలు లహరి (12), జస్వంత్ (7)లను ఇంట్లో వదిలి, ఓటు వేసేందుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎవరో తలుపు తట్టడంతో వచ్చింది ఎవరంటూ లహరి ఆరా తీసింది.
‘ఏసీ రిపేర్ చేయడానికి వచ్చానని.. మమ్మీ, డాడీ ఓటు వేసేందుకు వెళుతూ ఎదురు వచ్చారని, తలుపులు తీయాలని అతను కోరాడు. దీంతో ఆ చిన్నారి తండ్రికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే తలుపులు తీసి బయటకు వచ్చింది. బయటే వేచి ఉన్న అగంతకుడు అమె గొంతు పట్టుకుని నులుముతూ లోపలి గదిలోకి తీసుకెళ్లి బెదిరించడంతో, ఆమె తమ్ముడు జస్వంత్ బీరువా తాళాలు ఇచ్చేశాడు. బీరువా తెరిచి.. 30 తులాల బంగారు నగలు, రూ. లక్ష నగదు తీసుకుని దుండగుడు ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని సమాచారం అందించడంతో త్రీటౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతకు ముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చిన్నారి చెబుతోంది.
Breadcrumb
చిన్నారి గొంతు నులిమి దోపిడీ
Published Mon, Mar 31 2014 1:09 AM
# Tag
Related news
-
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం కాదు’
‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన గీతం!ఈ వీడియో చూస్తే ఆ పాట గుర్తుకు రాక మానదు. బెంగళూరు ట్రాఫిక్ కూడళ్లలో పండు ముదుసలి ఒకరు.. ‘‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ఒంటరిగా ప్రచారం చేశారు. ఆ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలూ ఫిదా అయ్యారు. ‘‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’’ అంటూ కొందరు ప్రశంసించడమూ ఈ వీడియోలో చూడొచ్చు. ನನ್ನ ಮತ ದ್ವೇಷಕ್ಕಾಗಿ ಅಲ್ಲ❌ನನ್ನ ಮತ ಬದಲಾವಣೆಗಾಗಿ✅ಒಂದು ವಿನೂತನ ಕ್ಯಾಂಪೇನ್👇 pic.twitter.com/MwkXcYe3JR— Mamatha R (@mamathcr) April 25, 2024 ఇక.. రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
శతాధిక వృద్ధుడి స్ఫూర్తి.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు
సార్వత్రిక ఎన్నికలు రెండో దశ పోలింగ్లో ఆదర్శంగా నిలిచాడు ఈ శతాధిక వృద్ధుడు. శుక్రవారం జరిగిన లోక్సభ ఎన్నికల రెండో విడతలో ఓటు వేయడానికి 102 ఏళ్ల హాజీ కరమ్ దిన్ జమ్మూలోని పోలింగ్ బూత్కు చేరుకున్నాడు. చేతి కర్ర, కుటుంబ సభ్యుల సాయంతో జమ్మూ నియోజకవర్గంలోని రియాసి జిల్లాలోని పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేశాడు.ఓటు వేసిన అనంతరం శతాధిక వృద్ధుడు తన సిరా వేసిన వేలిని చూపిస్తూ బూత్ బయట ఫొటోలకు పోజులిచ్చాడు. "ఈ వయస్సులో ఈ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిసారీ ఓటు వేశాను. 102 సంవత్సరాల వయస్సులో ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది" అని ఆయన వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.రియాసి జిల్లా జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 22 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17.81 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూలో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు ఇవే. -
చంద్రబాబు ఆదేశాలతో బీసీ నేతను ఈడిపడేసి..!
చంద్రబాబు ఆదేశాలతో బీసీ నేతను ఈడిపడేసి..! -
బీసీ నేతను అవమానించిన చంద్రబాబు
సాక్షి, అనంతపురం: గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారడం లేదు. బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది. అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్, బోయ - వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజును చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గెంటేశారు. కళ్ల ముందే బీసీ నేతకు అవమానం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారే తప్ప పట్టించుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ గ్రామంలో ఘటన జరిగింది. చంద్రబాబు వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నారు. గతంలో "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని బీసీలు గుర్తుచేసుకుంటున్నారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరింపులకు తెగిన సంగతి తెలిసిందే. "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అంటూ దారుణంగా మాట్లాడారని చంద్రబాబు తీరును బీసీలు గుర్తుచేసుకుంటూ మండిపడుతున్నారు.
Related News by category
-
విశ్వసనీయతే విజయానికి మెట్టు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రభుత్వానికి లేదా పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది. ఇది రాజకీయ విశ్లేషకులో.. సర్వే సంస్థలో చెబుతున్న మాటకాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గొంతులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా గత ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మరింతగా పెంచి వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలను కొనసాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని అందులో ఆయన స్పష్టంచేశారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి 650కి పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టిన చంద్రబాబు.. కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోయిన హామీలకే ‘సూపర్ సిక్స్’ అని ముసుగేసి.. తల్లికి వందనం పథకం కింద ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఐదుగురు.. ఇలా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామంటూ రోజూ హామీల పాట పాడుతున్నారు. చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో పది నెలలుగా ఆయన ఊదరగొడుతున్న ఈ హామీలను ఎవరూ పట్టించుకోవడంలేదు. అదే సమయంలో.. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో ఈ నమ్మకమే వైఎస్సార్సీపీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు 2009 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. వైఎస్ విశ్వసనీయతకే పెద్దపీట.. 2004 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాట మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందించడం, వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీచేస్తూ సీఎంగా తొలి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులందరికీ ఇళ్లు వంటి ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు.. ఆరోగ్యశ్రీ వంటి ఇవ్వని హామీలను కూడా అమలుచేసి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. 2009 ఎన్నికల్లో.. 2004 నాటి హామీల అమలును కొనసాగిస్తూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని.. ప్రతినెలా ఒకరికి నాలుగు కేజీల చొప్పున ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచి ఇస్తామంటూ కొత్తగా రెండే హామీలిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అంటూ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా దిగారు. వైఎస్కు ఉన్న ప్రజాబలం చూసి 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమిగా ఏర్పడి పోటీకి దిగారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ అడ్డగోలుగా హామీలిచ్చి పారేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబం ఖాతాలో ప్రతినెలా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ (డీబీటీ) కింద జమచేస్తామన్నారు. కానీ, 1995–2004 వరకూ బాబు మోసాలు, అరాచకాలను గుర్తుంచుకున్న ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికే పట్టంకట్టారు. చరిత్ర పునరావృతం ఖాయం.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు.. రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగభృతిగా రూ.2 వేలు ఇస్తానంటూ 650కి పైగా హామీలను ఎడాపెడా గుప్పించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయంచేశారు. అందులోని ఒక్కదాన్నీ అమలుచేయకుండా వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టారు. ఆ ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలను అమలుచేశారు. నవరత్నాలు పథకాలు కింద డీబీటీ రూపంలో 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గింది. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలైన విద్యాకానుక, గోరుముద్ద, వసతిదీవెన వంటి హామీలను అమలుచేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించేందుకు వచ్చే ఐదేళ్లూ నవరత్నాల పథకాలను విస్తరించి, కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అమ్మఒడిని రూ.15 వేలను రూ.17 వేలకు.. రైతుభరోసాను రూ.13,500లను రూ.16 వేలకు.. పెన్షన్ను రూ.3 వేల నుంచి రూ.3,500లకు పెంచుతామని హామీనిస్తూ మళ్లీ రెండే పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కొనేందుకు భయపడిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో మళ్లీ జట్టుకట్టి సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టో పాట పాడుతున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు పేర్కొన్న హామీలన్నీ కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడాన్ని ప్రజలు తెలుసుకున్నారు. దీంతో అడ్డగోలు హామీలిచ్చేస్తున్నారు. అయినా.. వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మాటపై నిలబడే సీఎం వైఎస్ జగన్కే మరోసారి పట్టం కట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. 2009 నాటి చరిత్ర పునరావృతం కావడం ఖాయమంటున్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు!
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కిపైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేసు నుంచి తప్పించారు. 16 నియోజక వర్గాల్లో మాత్రం రెబల్స్ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో తొమ్మిది చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా.. ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం గమనార్హం. రాప్తాడులో రెబల్ పోటు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో సాకే రాజేష్ కుమార్ రెబల్గా పోటీలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఓట్లకు గండి పడటం ఖాయమనే భయం టీడీపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్ పసుపులేటి సుధాకర్ బరిలో దిగారు. సుధాకర్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం టీడీపీకి సంకటంగా మారింది. చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానాన్ని మొదటి నుంచి కష్టపడిన తనకు కాకుండా ఫిరాయింపు నేత ఆదిమూలానికి ఇవ్వడంతో జేడీ రాజశేఖర్ తిరుగుబాటు చేసి బరిలో నిలిచారు. అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ నియోజకవర్గంలోనే టీడీపీని మరో రెబల్ అభ్యర్థి యాతాటి రమేష్బాబు బెంబేలెత్తిస్తున్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా దామోదర్నాయుడు పోటీలో ఉన్నారు.రఘురామ గుండెల్లో రైళ్లు అనేక మలుపులు తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానంలోనూ టీడీపీకి రెబల్ బెడద తప్పలేదు. ఇక్కడ రఘురామకృష్ణంరాజుకు పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీలో ఉన్నారు. ఆయన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టీడీపీ ఓటమే లక్ష్యంగా శివరామరాజు మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు ఇవ్వడంతో మొడియం శ్రీనివాస్ రెబల్గా బరిలోకి దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీటు దక్కలేదనే అసంతృప్తితో పరమట శ్యామ్కుమార్ పోటీలో నిలిచారు.టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తువిజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్ అభ్యర్థిగా రేసులో నిలవడంతోపాటు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి నేతలు కంగు తిన్నారు. తనకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారంటూ మీసాల గీత రెబల్గా నామినేషన్ వేశారు. అశోక్గజపతిరాజు కుమార్తె అతిథికి సీటు ఇచ్చి తనను అవమానించారని, ఆమెను ఎలాగైనా ఓడిస్తానని మీసాల గీత శపథం చేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం నుంచే గుర్తుతో కూడిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అరకులో టీడీపీ రెబెల్గా సివేరి అబ్రహం పోటీలో ఉండడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.బాలయ్యకు పరిపూర్ణానంద ఝలక్ కూటమి సీటు దక్కకపోవడంతో హిందూపురం నుంచి స్వామి పరిపూర్ణానంద బీజేపీ రెబల్గా బరిలో నిలిచారు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గగకుండా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో పరిపూర్ణానంద దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరంలోనూ బీజేపీ రెబల్స్ పోటీలో ఉన్నారు. పెడన, జగ్గంపేటలో జనసేన సీటు దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.ఫలించని సీఎం రమేష్ పైరవీలుఅనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పాయకరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత తమ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా చేసిన పైరవీలు ఫలించలేదు. సీఎం రమేష్ తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర పెద్దల ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు కోరిన చోట వారికి కేటాయించారు. జనసేన పోటీ చేసిన చోట్ల గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని, పోటీ చేయని చోట ఫ్రీ సింబల్గా ప్రకటించి ఇండిపెండెంట్లకు కేటాయించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. పాయకరావుపేట అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానానికి వడ్లమాని కృష్ణ స్వరూప్ దళిత బహుజన పార్టీ తరఫున నామినేషన్ వేశారు. తనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఆర్వో కార్యాలయానికి చేరుకుని అభ్యంతరం తెలిపినా ఫలితం దక్కలేదు. తాను కోర్టును ఆశ్రయిస్తానని కృష్ణ స్వరూప్ స్పష్టం చేయడంతో అధికారులు నిబంధనల ప్రకారం ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. -
మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు.. బాబు చరిత్రే మోసం: సీఎం జగన్
బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుందో చంద్రబాబును నమ్మితే కూడా అదే అవుతుంది. అక్కడ బిందెడు పన్నీరు గోవిందా.. ఇక్కడ పథకాలూ గోవిందా! గతంలో బాబును నమ్మి ఓటు వేసినందుకు బంగారు రుణాలు గోవిందా...! డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల మాఫీ గోవిందా...! ప్రత్యేక హోదా, ఉమ్మడి రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా.. గోవిందా! తిరుమల వెంకన్న స్వామిని తలచుకుని చెప్పే గోవిందా గోవిందాలు కావు ఇవి. బాబును నమ్మితే అన్నీ గోవిందా..! – చోడవరం సభలో సీఎం జగన్జగన్ను ఎందుకు ఓడించాలని అడగండి. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుకా? ఇంటింటికీ సంక్షేమాన్ని అందిస్తూ మంచి చేస్తున్నందుకా? చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు,జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం కోసం జగన్ను ఓడించాలా? వీరంతా కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా..? దోచుకున్నది పంచుకోవడం కోసమా? మరి జగన్ను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబూ? – అంబాజీపేట సభలో సీఎం జగన్మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను ‘‘బచ్చా..’’ అని అంటూనే భయపడుతున్నారు. చంద్రబాబూ నువ్వు నిజంగా అంత పుడింగే అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా? 14 ఏళ్లలో ఏ ఒక్క మంచీ చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్ ఐదేళ్లలో చేసిన పథకాలనే అమలు చేస్తానని చెబుతున్నావంటే దాని అర్థం ఏమిటి? మరి ఇప్పుడు ఎవరు బచ్చా? ఎవరు లీడర్? చెప్పు చంద్రబాబూ..! – పొన్నూరు సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. 2014 ఎన్నికల హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబుకు అసలు ఓటు ఎందుకు వేయాలని ప్రజలంతా గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జరిగే నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్, గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చరిత్ర చెబుతున్న సత్యం.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. మనం వేసే ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ సజావుగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా అంటూ మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ఇది చంద్రబాబు గురించి చరిత్ర చెబుతున్న సత్యం. బాబును నమ్మడం అంటే విషసర్పాన్ని నమ్మడమేనని గుర్తుంచుకోండి. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేసిందేమిటంటే.. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ 5కి ఇంత.. అంటూ అంతా కలసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే! బాబు డబ్బులిస్తే తీసుకోండి.. మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కితే రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లాయి. చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా దోచుకుని పంచుకున్నారు. చంద్రబాబు దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేలు.. రూ.3 వేలు.. రూ.4 వేలు.. రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. చంద్రబాబు డబ్బులిస్తే వద్దు అనొద్దండీ...! తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకుండా తీసుకోండి. కానీ ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది? ఎవరు అధికారంలో ఉంటే ఆ మంచి కొనసాగుతుంది? అనేది మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మనం ఉంటేనే.... మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్నతోడు, జగనన్న చేదోడు, లా నేస్తం లాంటివి సజావుగా కొనసాగుతాయి. పూర్తిగా ఫీజురీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన, కల్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష... ఇవన్నీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయన్నది గుర్తుంచుకోండి. ఇంటికే రూ.3 వేల పెన్షన్, మళ్లీ పెంచనున్న పెన్షన్, ఇంటి ముంగిటికే రేషన్, పౌర సేవలు, పథకాలన్నీ అందుతాయని గమనించాలని కోరుతున్నా. ఏ నెలలో ఏ పథకం అనేది ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ మీ బిడ్డ లబ్ధి చేకూరుస్తున్నాడు. రెండు బటన్లూ ఫ్యాన్కే... వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా... అవి ఇంటికే రావాలన్నా... లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుండాలన్నా, మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించాలి. సామాజిక న్యాయంలో నువ్వెక్కడ?ఈరోజు కేబినెట్లో 68 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కనిపిస్తున్నారు. 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అందిస్తే ఏకంగా 75 శాతం నేను ‘‘నా’’ అని పిలుచుకునే పేద వర్గాలకే దక్కింది. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏకంగా 80 శాతం పైచిలుకు ఆ సామాజిక వర్గాల పిల్లలకే దక్కాయి. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఆ వర్గాలకు ఏకంగా 50శాతం రిజర్వేషన్లతో చట్టం చేసి మరీ ఆత్మగౌరవం నిలబెట్టింది మీ జగన్ పాలనలోనే. 175 అసెంబ్లీ, 25 ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే వంద సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతకు అర్థం చెప్పింది నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ కాదా? సామాజిక న్యాయంలో నువ్వు చేసింది ఏందయ్యా చంద్రబాబూ? ఓ మోసాల బాబూ.. ఓ మోసాలయ్యా..! నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి 2014లో మీరిచ్చిన పాంప్లెట్ సరిపోదా? కోనసీమను కోరుతున్నా..కోనసీమలో మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత ఎన్నికల్లో కులపరంగా లేదా పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే తరాల భవిష్యత్తు మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంది. రాబోయే ఐదేళ్లలో మీ ఇంటికి పథకాలు, అభివృద్ధి అనేది నిర్ణయించేది మీ ఓటే. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లలకు ఓటు హక్కు లేదని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఎలా ఉండేది?చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? మీ బిడ్డ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులేమిటో మీరంతా చూస్తున్నారు కదా. ఎవరు హీరో? ఎవరు విలన్? ఈ యుద్ధంలో అటువైపు ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. చంద్రబాబుకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరందరూ సరిపోరు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు! పేదవాడికి ఎప్పుడూ ఎలాంటి మంచి చేసిన చరిత్ర లేని వీళ్లంతా కూటమిగా మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటున్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న ఆ దేవుడిని. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ బిడ్డ వచ్చాడు. పేదలకు మరింత మంచి చేస్తూ ఇంటింటి అభివృద్ధి, పౌరసేవలు, ఇంటికే పథకాలు కొనసాగింపుగా వైఎస్సార్ సీపీ 2024 మేనిఫెస్టోను రూపొందించాం. సినిమాకు వెళ్లినప్పుడు హీరో మంచి చేస్తాడు కాబట్టి అందరికీ నచ్చుతాడు. హీరోలో మానవత్వం ఉంది కాబట్టి నచ్చుతాడు. విలన్ ఎందుకు నచ్చడు? విలన్ మోసాలు, అబద్ధాలు, కుట్రలు చేస్తాడు కాబట్టి నచ్చడు. నిజ జీవితంలో కూడా ఆలోచన చేయండి ఎవరు హీరో? ఎవరు విలన్?దీవించండి...అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ, పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణలను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావ్?⇒ నువ్వు అంటున్నట్లుగా నేను బచ్చానే అయితే ఇంటింటికీ సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలో విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో బాగుపడిన ఇంగ్లీషు మీడియం బడులు, డిజిటల్ బోధన, ట్యాబ్లు, గ్రామంలోనే మహిళా పోలీసు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు.. ఇవన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబూ? ⇒ చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీతో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాడు. నేను బచ్చా అయితే.. మరి ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబూ? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు? ⇒ నేను బచ్చాను అయితే ఒక అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహనమిత్ర, ఇంటికే రూ.3 వేల పెన్షన్, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా... ఇలాంటి పథకాలన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండీ ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబూ?2014లో గోవిందా గోవిందా..!⇒ 2014లో చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు నెలకు రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో నిరుద్యోగికి ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి గోవిందా! ⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాల మాఫీ గోవిందా! ⇒ రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ గోవిందా! ⇒ అప్పటి దాకా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవింద. ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేస్తామన్న రూ.25 వేలు గోవిందా! ⇒ ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు గోవిందా! ⇒ ఓటుకు కోట్లు కేసులో చిక్కడంతో మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద! ⇒ బాబును నమ్మి ఓటు వేసినందుకు ప్రత్యేక హోదా గోవిందా! ⇒ ప్రత్యేక ప్యాకేజీ కూడా గోవిందా...గోవిందా! ⇒ విభజన హామీలూ గోవిందా. ⇒ సింగపూర్కు మించిన రాజధాని గోవిందా! ⇒ గ్రాఫిక్స్ రాజధాని గోవిందా.. గోవిందా! ⇒ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ హామీ గోవిందా.. గోవిందా! ⇒ బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా! ⇒ బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా! ⇒ సింగపూర్కు మించిన రాజధాని కడతానంటూ పక్కనే అన్ని హంగులతో కనిపిస్తున్న మన విశాఖను విస్మరించారు. ⇒ బాబు మాటలు నమ్మితే అంతా గోవిందా.. గోవింద!జగన్ను ఓడించాలట.. ఇందుకా!⇒ 77 ఏళ్ల స్వతంత్ర దేశ చర్రితలో ఏప్రభుత్వాలూ చేయనంత మంచిని మీ బిడ్డ ఐదేళ్లలో చేసినందుకు ఓడించాలా? ⇒ 130 సార్లు బటన్లు నొక్కి లంచాలు లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో అందించినందుకా? ⇒ ఈ పథకాలేవీ చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ను ఓడించాలా? ⇒ ఐదేళ్లలో చంద్రబాబు కేవలం 32 వేల గవర్నమెంట్ ఉద్యోగాలిస్తే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకా? ⇒ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు బిడ్డలను బడులకు పంపిస్తే చాలంటూ అమ్మ ఒడి ఇచ్చినందుకా? ⇒ ఏ ప్రభుత్వం చేయని విధంగా 66 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్లు ఇచ్చినందుకా? ⇒ అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్ చిరునవ్వుతో ఇస్తున్నందుకా? ⇒ మానవత్వం లేకుండా ఇంటివద్దే పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబుకు సంతోషం కలిగించేందుకా? ⇒ ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్నందుకా? ⇒ చరిత్ర ఎరుగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మలకు వారి పేరిట రిజి్రస్టేషన్ చేసి మరీ ఇచ్చినందుకా? ⇒ 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినందుకా? ⇒ మరి జగన్ను ఎందుకు ఓడించాలి? బాబుకు ఎందుకు ఓటు వేయాలనేది మీరే చెప్పాలని అందరినీ అడుగుతున్నా.పోయేకాలం వచ్చినప్పుడు..విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో అంతా చూస్తున్నారు. తన హయాంలో ఏం చేశాడో చెప్పుకుని ఓట్లు అడగాల్సింది పోయి మీటింగుల్లో జగన్ను తిడుతున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాద్కు వెనక్కు పోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబూ..! నువ్వు బచ్చా అంటున్న నేను ప్రతి ఇంటికీ మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ప్రజల్ని ఓటు అడుగుతున్నా. మరి నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానంటావ్. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకొస్తుందా? -
ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులని అన్నారు.ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా ముస్లిం రిజర్వేషన్లు, ఆ తర్వాత దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారని తెలిపారు. ఇందుకోసం బీజేపీ చేస్తున్న కుట్రను చంద్రబాబు, పవన్ ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింలు, దళితుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసమే ఆలోచిస్తారన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరని స్పష్టంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ వాది అని తెలిపారు. సోమవారం సాక్షి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి వరకు విశ్వగురు, జీ–20,చంద్రయాన్, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడు అవన్నీ వదిలేసి హిందూ–ముస్లిం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ముస్లింలను ద్వేషించడం ఒక్కటే ప్రధాని మోదీ గ్యారంటీ అని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ ఆయనలోని లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారన్నారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారు వైఎస్ఆర్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఒవైసీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషమని, 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబి్ధపొందడం బీజేపీకి మింగుడుపడటంలేదని తెలిపారు.విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలు లబ్ధి పొందడం, స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చడంలేదని, దీంతో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా వారికి రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కుట్రలు ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో వీరు అధికారంలోకి వస్తే బీజేపీ కుట్రలు అమలు చేస్తారని, చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి టీడీపీ, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.హామీ ఇచ్చి అమలు చేసిన వైఎస్సార్ముస్లిం రిజర్వేషన్లను మహానేత వైఎస్సార్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేశారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, ముస్లింలలో కుల ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని ఆ కమిటీ తేలి్చందని చెప్పారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.సెక్యులర్ లీడర్ జగన్కు అండగా నిలవండి సెక్యులర్ లీడర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ మద్దతివ్వాలని ఒవైసీ కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడూ దళితులు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. ముస్లింలు, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ లీడర్ జగన్ ఏపీకి అవసరమని, ఆయనకు మద్దతుగా నిలిచి ఓటెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. -
మాజీ సీఎం చంద్రబాబు విచక్షణతో మాట్లాడాలి
వేంపల్లె : మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ అన్నారు. వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఆమె సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారని, ప్రజా జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. ఇలాంటి ఆలోచనలు మంచివి కావన్నారు. విశాఖ, విజయవాడల్లో జరిగిన హత్యాయత్నాల లాంటి ఘటనలను ప్రేరేపించడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్లకు కళ్లు లేవని అనుకుంటున్నానని అన్నారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్ను వారి పెద్ద కొడుకని, నెలనెలా ఇంటికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఐదేళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని, సీఎం జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజలు చెబుతుండటంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్రెడ్డి, ఎంపీపీ లక్ష్మిగాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement