ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అభ్యర్థుల తరఫున ఎవరెవరూ ఏజెంట్లుగా ఉండొచ్చనే నిబంధనలను స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోల)కు ఆదేశాలు జారీ చేసింది. సిట్టింగ్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా ఉండటానికి అనర్హులని ఈసీ స్పష్టం చేసింది. మునిసిపల్, నగర పంచాయతీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ సహకార సంస్థల చైర్మన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు నియమితులైన చైర్మన్లు కూడా ఏజెంట్లుగా అనర్హులని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులను ఏజెంట్లుగా అనుమతించరాదని పేర్కొంది.
వారిని మినహాయించి 18 ఏళ్ల వయసు నిండిన వేరెవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చనిపేర్కొంది. స్థానికులనే నియమించుకోవాలనే నిబంధన ఏదీ లేదని వివరణ ఇచ్చింది. ప్రత్యేక సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సెక్యూరిటీ ఉంటే... ఆ సిబ్బందిని సరెండర్ చేసిన తర్వాతే వారిని అనుమతించాలని పేర్కొంది. ఎస్పీజీ భద్రత ఉన్న అభ్యర్థులైతే ఒకే ఒక్క ఎస్పీజీతో మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలని, ఆ ఎస్పీజీ వ్యక్తి కూడా సాధారణ దుస్తులు ధరించే రావాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈసీ నిబంధనలు
Published Mon, May 12 2014 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement