టీడీపీ ప్రచార సభల్లో 'బాల' కార్మికులు! | below 12 years kids in the election campaign of tdp! | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రచార సభల్లో 'బాల' కార్మికులు!

Apr 27 2014 12:56 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలుగు తమ్ముళ్లు పచ్చదండు పారాహుషార్ అంటూ ఎన్నికల సమరానికి సమాయాత్తమవుతున్నారు.

హైదరాబాద్: తెలుగు తమ్ముళ్లు  పచ్చదండు పారాహుషార్ అంటూ ఎన్నికల సమరానికి సమాయాత్తమవుతున్నారు. కానీ అసలు తంతు ఇక్కడే ఉంది. ఆ తమ్ముళ్ల వయస్సు పన్నెండు ఏళ్ల లోపే.  టీడీపీ వారికి కార్యకర్తలు దొరక్కపోవడమా? మరో కారణమో తెలియదు కాని..స్కూల్స్‌కు సెలవులు ఇవ్వడంతో ఓటు హక్కులేని పిల్లలను బాలకార్మికులుగా మార్చుతున్నారు. చిన్నారులకు  భవితవ్వానికి భరోసా ఇవ్వాల్సిన నాయకులే వారి చేత జెండా పట్టించి రోజు వారిగా కూలీలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని కుత్బుల్లా పూర్ లో చోటు చేసుకోవడంతో సగటు ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బడిపిల్లలను రోజువారి కూలీలుగా మార్చుతున్న టీడీపీ వ్యవహారంపై ఈసీ కొరడ ఝలిపించాలి.. లేకపోతే మిగితా పార్టీలు వీరికి మార్గనిర్ధేశకులవుతారు. ఇప్పటికైన ఎన్నికల సంఘం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement