ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ | germany football world cup celebration | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ

Dec 31 2014 10:51 PM | Updated on Sep 2 2017 7:02 PM

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ

2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు: పురుషుల సింగిల్స్: స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్). మహిళల సింగిల్స్: నాలీ (చైనా).

-    2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు: పురుషుల సింగిల్స్: స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్). మహిళల సింగిల్స్: నాలీ (చైనా).
 
-    లక్నోలో జనవరి 26న జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత నంబర్ వన్ షట్లర్ సైనానె హ్వాల్ గెలుచుకుంది.
 
-    న్యూజిలాండ్‌కు చెందిన కేథీక్రాస్ ఐసీసీ అంపైర్ ప్యానల్‌కు ఎంపికైన తొలి మహిళగా చరిత్ర పుటలకెక్కింది.
 
-    రంజీ ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. ఈ టైటిల్ నెగ్గడం కర్ణాటకకు ఇది ఏడోసారి.
 
-    రష్యాలో జరిగిన క్యాండిడేట్ టోర్నీ చెస్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కైవసం చేసుకున్నారు.
 
-    టి-20 మహిళల ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
 
-    2005 మొనాకోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ స్వర్ణపతకం గెలుచుకున్నట్లుగా ఏప్రిల్ 1న ఇంటర్నేషనల్ అసోసియే షన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అంజూ చరిత్ర సృష్టించింది.
 
-    సోచిలో పదిహేను రోజులపాటు జరిగిన వింటర్ ఒలింపిక్స్ పోటీల్లో ఆతిథ్య రష్యా ఎక్కువ పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
 
-    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-7 క్రికెట్ టోర్న మెంట్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది.
 
-    ఫ్రెంచ్ ఓపెన్ 2014 విజేతల వివరాలు: మహిళల సింగిల్స్: మరియా షరపోవా(రష్యా). పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్).
 
-    వన్డే క్రికెట్‌లో భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌లో జూన్ 17న భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాలుగు పరుగులకు ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
 
-    సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సిడ్నీలో జూన్ 29న జరిగిన ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌పై విజయం సాధించింది.
 
-    పురుషుల ప్రపంచ హకీ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. జూన్ 15న ద హేగ్‌లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాను ఓడించి నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది.
 
-    వింబుల్డన్ విజేతల వివరాలు: మహిళల సింగిల్స్: పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్). పురుషుల సింగిల్స్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).
 
-    భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రష్యా సమాఖ్యకు చెందిన ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు.
 
-    బ్రెజిల్‌లో మారకానాలో జూలై 13న జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనాను ఓడించి విజేతగా నిలిచింది. ఉత్తర,దక్షిణ అమెరికా ఖండంలో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో గెలుపొందిన తొలి ఐరోపా దేశంగా జర్మనీ చరిత్ర సృష్టించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచకప్. 2018లో జరిగే 21వ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు రష్యా ఆతిథ్యమివ్వనుంది. ఫిఫా అవార్డుల వివరాలు.. గోల్డెన్‌బాల్ (అత్యుత్తమ ఆటగాడు): లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్): రోడ్రిగెజ్ (కొలంబియా), గోల్డెన్ గ్లోవ్ (అత్యుత్తమ గోల్‌కీపర్): మాన్యుల్ న్యూర్ (జర్మనీ),ఉత్తమ యువ ఆటగాడు: పాల్ ఫోగ్బా (ఫ్రాన్స్), ఫెయిర్ ప్లే అవార్డు (కొలంబియా జట్టు)
 
-    స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడాలు తొలి మూడు స్థానాలను కై వసం చేసుకున్నాయి. తెలుగు క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించాడు. 21వ కామన్‌వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో 2018లో జరగనున్నాయి.
     
మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు  
దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం
ఇంగ్లండ్    58    59    57    174
 ఆస్ట్రేలియా    49    42    46    137
 కెనడా     32    16    46    82
 స్కాట్లాండ్    19    15    19    53
 భారత్    15    30    19    64
 
-  ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను చైనాకు చెందిన చెన్‌లాంగ్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్ (స్పెయిన్) కైవసం చేసుకుంది. భారత్‌కు చెందిన పి.వి. సింధు వరుసగా రెండో ఏడాదీ కాంస్యం నెగ్గింది. ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.
 
-    యూఎస్ ఓపెన్ టెన్నిస్-2014 విజేతల వివరాలు: మిక్స్‌డ్ డబుల్స్ సానియా -బ్రునో సొరెస్ (బ్రెజిల్). సానియాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. పురుషుల సింగిల్స్: క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్. మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్. మహిళల డబుల్స్: ఎకటెరీనా మకరోనా-ఎలెనా వెస్నినా (రష్యా). పురుషుల డబుల్స్: అమెరికాకు చెందిన మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ సోదరులు గెలుచుకున్నారు. వీరికిది వందో డబుల్స్ టైటిల్.
 
-    2014 బ్రాడ్‌మన్ పురస్కారానికి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్‌వా (ఆస్ట్రేలియా)లను బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ఎంపికచేసింది.
 
 -    దక్షిణ కొరియాలోని ఇంచియా న్‌లో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణకొరియా రెండో స్థానం, జపాన్ మూడో స్థానం సాధించాయి. భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. నాలుగు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన జపాన్ స్విమ్మర్ కొనుగో హగినో అత్యంత విలువైన ఆటగాడి అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతాయి.
 
పతకాల పట్టిక:
దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం
చైనా    151    108    83    342
దక్షిణకొరియా    79    71    84    234
 జపాన్    47    76    77    200
 భారత్    11    10    36    57
 
-    చాంపియన్స్ లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది.
-    అక్టోబరు 24న లీడ్స్‌లో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ పోటీల్లో భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
 
-    భారత షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య చైర్మన్‌గా ఎంపికయ్యారు.
 
-    దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ జట్టు గెలుచుకుంది.
 
-    బ్రిటన్‌కు చెందిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో 2014 ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు.
 
-    బీసీసీఐ 2014 అవార్డుల వివరాలు: కల్నల్ సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం: దిలీప్ వెంగ్‌సర్కార్, ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ) పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.
 
-    మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకాన్ని అక్టోబరు 5న
 ముంబైలో ఆవిష్కరించారు.
 
-    సోచిలో నవంబరు 23న ముగిసిన చెస్ ప్రపంచ చాంపియన్ పోటీల్లో మాగ్నస్ కార్ల్‌సన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
 
-    అహ్మదాబాద్‌లో నవంబరు 25న జరిగిన విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది.
-    క్రికెట్ ఆడుతూ గాయపడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) సిడ్నీ ఆసుపత్రిలో నవంబరు 27న మరణించాడు.
 
-    భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు నవంబరు 30న మకావ్‌లో జరిగిన మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
 
-    {పపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చైనాకు చెం దిన 14 ఏళ్ల యాన్ బింగ్‌టావ్ కైవసం చేసుకున్నాడు.
 
-    దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది.
 
-    దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్‌లో డిసెంబరు 7న జరిగిన అంధుల ప్రపంచకప్ క్రికెట్‌ను భారత జట్టు గెలిచింది.
 
-    చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 14న భువనేశ్వర్‌లో కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది.
 
-    ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్‌ను భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ గెలుచుకుంది.
 
-    భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.
 
-    2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
 
-    పురుషుల విభాగంలో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ (అమెరికా)లను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) డిసెంబర్ 18న ఇంటర్నేషనల్ చాంపియన్‌‌సగా ప్రకటించింది.
 
-    రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా ఐదోసారి, మహిళల జట్టు నాలుగోసారి కబడ్డీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 20న పంజాబ్‌లోని గురుగోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పురుషుల జట్టు, పాకిస్థాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది.
 
-    తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టైటిల్‌ను అట్లెటికో డి కోల్‌కతా గెలుచుకుంది.
 
-    ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) అవార్డులు-2014 డిసెంబర్ 27న ముంబైలో ప్రకటించారు. వివరాలు: ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (పురుషులు)-సునిల్ చెత్రీ (భారత కెప్టెన్), ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-బాలా దేవీ, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-సందేశ్ జింగమ్.
 
-   భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్‌కు విడ్కోలు చెప్పాడు. డిసెంబర్ 30న మెల్‌బోర్‌‌నలో ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్ట్ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.
 
బంగ్లాదేశ్‌లో జరిగిన టి-20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్లో భారత్‌ను ఓడించింది. 1996 తర్వాత ఐసీసీ నిర్వహించిన పోటీలో శ్రీలంక విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్‌కోహ్లి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర ఎంపికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement