పిడుగుపాటుకు మహిళ మృతి | Woman found dead with lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ మృతి

Apr 26 2016 4:46 PM | Updated on Mar 28 2018 11:26 AM

పొలంలో పనిచేసుకుని వెళుతున్న ఇద్దరు మహిళలపై పిడుగుపడి ఒకరు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

- శంషాబాద్‌మండలం కవ్వగూడలో విషాదం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా)

పొలంలో పనిచేసుకుని వెళుతున్న ఇద్దరు మహిళలపై పిడుగుపడి ఒకరు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కవ్వగూడకు చెందిన భార్గవి(28) సంధ్య (18) పొలంలో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం మొదలు కావడంతో.. ఇంటికి వెళ్లేక్రమంలో మేడిచెట్టు వద్ద నిల్చున్నారు. ఆ సమయంలో పిడుగు పడి భార్గవి అక్కడిక్కడే మృతి చెందింది. సంధ్యకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆమెను శంషాబాద్‌లోని స్థానిక ఆసుప్రతికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement