వినాయక చవితి...సంవత్సరానికి ఒక్కసారే వచ్చే పండుగైనా సంవత్సరమంతా గుర్తుండేలా ఎవరికి వారు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అనంతపురం సప్తగిరి సర్కిల్లోని వినాయక చౌక్లో ప్రతిష్టించే గణపతికి విశేష ప్రాముఖ్యం ఉంది. అందుకే ఇక్కడే చేసే ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నెల 12న పంచమి రోజున భూమిపూజతో ప్రారంభమైన పనులు 25వ తేదీ చవితి నాటికి పూర్తయ్యాయి.
ఆగస్టు 12 : చవితి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతపురం నగర మేయర్ స్వరూప, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పరిచూరి రమేష్ ఆధ్వర్యంలో వినాయక చౌక్లో వేదపండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ప్రారంభానికి ప్రతీకగా కాషాయ జెండాను ఎగురవేశారు.
ఆగస్టు 17 : వినాయకచౌక్లో వేసే గణేష్ మంటపం నమూనా ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఈసారి రాజస్థాన్ నుంచి విచ్చేసిన కళాకారులు తమ నైపుణ్యంతో మంటపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే 17వ తేదీ నాటికి మంటపం ముఖ ద్వారం పనులు ప్రారంభించారు.
ఆగస్టు 19 : గణేష్ మంటపం కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉంటుంది. ముఖద్వారం నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఉండే మంటపంపై రేకులు వేయడంతో పాటు ముఖద్వారానికి ఓరూపు తీసుకువచ్చారు.
ఆగస్టు 22 : రాజస్థాన్లోని రణతంబోర్లోని ఆలయ నమూనాతో మంటపాన్ని ప్రారంభించిన కళాకారులు 22వ తేదీ నాటికి ముఖద్వారాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మంటపం ఎదురుగా రెండు ఏనుగులు ఘీకారం చేస్తున్నట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టప్రక్కల పరదాలను ఏర్పాటు కూడా పూర్తి చేశారు.
ఆగస్టు 23 : మంటపం ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. 23వ తేదీ బుధవారం నాటికి మంటపం పనులు పూర్యయ్యాయి. మంటపం లోపల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అవసరమైన నమూనా కూడా పూర్తి చేశారు. మంటపం బయట, లోపల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఆగస్టు 24 : పనులన్నీ పూర్తికాగా...విద్యుత్దీపాల వెలుగులో వినాయక చౌక్ కాంతులీనింది. సప్తగిరి సర్కిల్ నుంచి మంటపం వరకు విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు...అమ్మవారి రూపాలను రూపొందించారు. మంటపం లోపల ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట కదిలే విగ్రహాలను సిద్ధం చేశారు.
ఆగస్టు 25 : సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మంటపంలో రణతంబోర్ ఆలయంలోని విగ్రహాన్ని పోలిన రీతిలోనే తయారు చేసిన స్వామివారి విగ్రహాన్ని తెల్లవారుజామున ప్రతిష్టించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించి..దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
పంచమి నుంచి చవితి వరకు..
Published Fri, Aug 25 2017 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement