కార్పొరేషన్ అధికారిపై అత్యాచారయత్న ఆరోపణలు ! | vijayawada corporation officer attempt to rape on woman | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ అధికారిపై అత్యాచారయత్న ఆరోపణలు !

Jul 12 2016 7:46 PM | Updated on Sep 4 2017 4:42 AM

బెజవాడ నగరపాలక సంస్ధ అధికారి ఓ మహిళపై అత్యాచారయత్న ఆరోపణలు నగరంలో మంగళవారం తీవ్ర కలకలం రేపింది.

విజయవాడ: బెజవాడ నగరపాలక సంస్ధ అధికారి ఓ మహిళపై అత్యాచారయత్న ఆరోపణలు నగరంలో మంగళవారం తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఓ మహిళ జనన ధ్రువపత్రంలో తప్పులు సవరించుకోవడానికి కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లింది.

అక్కడ విధులు నిర్వహిస్తున్న డీసీవో రమేష్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తుంది. దీనిపై సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకేమీ తెలియదని బుకాయించిన అతన్ని ఆమె అందరి ముందు దేహశుద్ధి చేసింది. రమేష్పై వచ్చిన ఆరోపణలపై పోలీసులు, కార్పొరేషన్ ఉన్నతాధికారులు విచారణను ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

పోల్

Advertisement