నేడు రెండు అర్హత పరీక్షలు
ఎన్ఎంఎంఎస్కు 4,570,
ఎన్టీఎస్కు 5,540 మంది
ఎంపికయితే భవిష్యత్తు ఆనందమే
రాయవరం :
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారికి ఉపకార వేతనాలు అందించేందుకు నేషనల్ మీన్స కమ్ మెరిట్ సర్టిఫికెట్ (ఎన్ఎంఎంఎస్) పథకం ఏర్పాటు చేశారు. 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అర్హత పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు నేషనల్ టాలెంట్ సెర్చ్ (ఎన్టీఎస్) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలు ఈ నెల 6న జిల్లాలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
పేద విద్యార్థులకు భరోసా
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా పేద విద్యార్థుల్లో ప్రతిభా వంతులను ప్రోత్సహించేందుకు నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ను 2008–09లో ప్రవేశపెట్టారు. ఇది పేద విద్యార్థులకు విద్యాపరంగా భరోసానిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యంలో స్కాలర్షిప్కు అర్హత పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.6 వేలు చొప్పున నాలుగేళ్ల పాటు విద్యార్థికి స్కాలర్షిప్ను నేరుగా వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తారు. పదో తరగతి పాసైన అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే స్కాలర్షిప్ కొనసాగింపు జరుగుతుంది. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ అర్హత పరీక్షకు ఏటా విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏటా జిల్లా నుంచి సుమారు 400 మంది ఈ స్కాలర్షిప్కు ఎంపికవుతున్నారు.
ఎ¯ŒSటీఎస్ పరీక్ష ఉత్తీర్ణులైన వారు తిరిగి సెకండ్ లెవెల్ టెస్ట్కు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో కూడా ఉత్తీర్ణత సాధిస్తే వారికి ఇంటర్లో నెలకు రూ.1,250 చొప్పున, డిగ్రీ, పీజీ స్థాయిలో నెలకు రూ.2 వేలు వంతున స్కాలర్షిప్ అందజేస్తారు.
పరీక్ష విధానమిలా
ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎ¯ŒSఎంఎంఎస్ పరీక్షకు అర్హత పొందుతారు. ఏడో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా పరీక్షకు అర్హత కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 7వ తరగతిలో 50 శాతం, మిగిలిన విద్యార్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. ఆబ్జెక్టివ్ టైపు విధానంలో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. జిల్లా ప్రాతిపదికగా స్కాలర్షిప్కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితా ఆధారంగా వారి అకౌంట్లకు నేరుగా స్కాలర్ షిప్ అందజేస్తారు. ఈ ఏడాది ఎ¯ŒSఎంఎంఎస్ పరీక్షకు 4,570 మంది, ఎ¯ŒSటీఎస్ పరీక్షకు 5,540 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఓరియంటేష¯ŒS తరగతులు నిర్వహించాం
పేద విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఎ¯ŒSఎంఎంఎస్, ఎస్టీఎస్ అర్హత పరీక్షలు ఉపయోగపడుతున్నాయి. ఏటా దరఖాస్తు చేసే వారి సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామం. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించేందుకు ప్రత్యేకించి ఉన్నత పాఠశాలల్లో ఓరియంటేష¯ŒS తరగతులు నిర్వహించాం.
– ఆర్.నరసింహారావు, డీఈవో, కాకినాడ
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఎ¯ŒSఎంఎంఎస్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ పరీక్షలు డివిజ¯ŒS కేంద్రాల్లో 23 చోట్ల, ఎ¯ŒSటీఎస్ పరీక్షకు కాకినాడ పట్టణంలో 20 కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం
బాగా ప్రిపేరయ్యా..
ఎ¯ŒSఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు బాగా ప్రిపేరయ్యాను. తప్పనిసరిగా స్కాలర్షిప్ సాధిస్తాననే నమ్మకం ఉంది. ఉపాధ్యాయులు బాగా శిక్షణ ఇచ్చారు.
– వి.లోహితప్రియ, 8వ తరగతి విద్యార్థిని, రాయవరం.