గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి | Tribal traditions must Save | Sakshi
Sakshi News home page

గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి

Aug 14 2016 11:45 PM | Updated on Sep 4 2017 9:17 AM

గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి

గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి

గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ అన్నారు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం గిరిజనులు తీజ్‌ ఉత్స వాలు, బోగ్‌బండారో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎంపీ సీతారాంనాయక్‌ ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు.

  • మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌
  • ఘనంగా తీజ్‌ ఉత్సవాలు
  • మహబూబాబాద్‌ : గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ అన్నా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్న త పాఠశాలలో ఆదివారం గిరిజనులు తీజ్‌ ఉత్స వాలు,  బోగ్‌బండారో కార్యక్రమాన్ని చేపట్టా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎంపీ సీతారాంనాయక్‌ ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు తీజ్‌ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ తీజ్‌ పండుగ గిరిజనుల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భూక్య ఉమ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెం ట్‌ టి.వెంకట్రాములు, టౌన్‌ సీఐ నందిరాంనాయక్, డాక్టర్లు వీరన్న, నెహ్రూనాయక్, నాయకు లు హట్యానాయక్, స్వామినాయక్, బోడ లక్ష్మణ్, ధారావత్‌ భాస్కర్, రాజేష్‌ నాయక్, టీఆర్‌ఎస్‌ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, ఆశ్ర మ పాఠశాల హెచ్‌ఎం భాగ్యమ్మ పాల్గొన్నారు.
     
    16 తండాల్లో తీజ్‌ వేడుకలు
    మహబూబాబాద్‌ రూరల్‌ : మండలంలోని శని గపురంలో తీజ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్‌ గుగులోత్‌ రాజునాయక్‌ ఆధ్వర్యంలో 16 తండాలకు చెందిన గిరిజనులు ఒకే సారి తీజ్‌ వేడుకలను జరుపుకోవడంతో సందడి నెలకొంది. ఇందులో భాగంగా గ్రామ శివారులోని ఊరచెరువు వద్ద పెళ్లికాని యువతులు సంబురాలు చేసుకుని తీజ్‌ బుట్టల ను నిమజ్జనం చేశారు. ఎంపీ  సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, నాయకులు వెంకట్‌రెడ్డి, కుమారస్వామి,  సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్‌ వెంకన్ననాయక్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు  మోతీలాల్‌నాయక్, ఉప సర్పంచ్‌ కవిత సైదులు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గుగులోత్‌ రాములునాయక్, నాయకులు  రాము, లింగన్న, సత్యం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వినాయకతండాలో బానోత్‌ శంక ర్‌ మేస్త్రీ ఆధ్వర్యంలో జరిగిన తీజ్‌ వేడుకల్లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బి.ఉమ, వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ స్వాతి పాల్గొన్నారు.  

Advertisement

పోల్

Advertisement